kadapa dist news : e crop గడువును పెంచాలి - Rythu Seva Samithi
kadapa dist news : e crop గడువును పెంచాలి - Rythu Seva Samithi
ప్రభుత్వం రైతుల పంటసాగు నమోదు
కార్యక్రమం ఐన, e-crop నమోదు కార్యక్రమ నమోదు గడువును, పెంచాలని రైతు సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులు
ఎ వి రమణ, మస్తాన్ రావులు ఓ ప్రకటనలో కోరారు. కడప జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో, రైతులు సరైన సమయంలో పంటను సాగు చేయలేక పోయారని, ఖాజీపేట మండలం, మరికొన్ని ప్రాంతాల్లో కేసీకెనాల్ రైతులు, వరినాట్లు వేయడం గత రెండు మూడు రోజుల కిందట మొదలైనవి అని తెలిపారు. ఇవి పూర్తి కావాలంటే పది నుంచి పదహైదు రోజుల సమయం పడుతుందని అన్నారు.
ఆరుతడి పంటలు సాగుచేసునే వర్షాధార సాగు కూడా, ఈ ఏడు ఆలస్యం అవుతున్నదని, సరైన పదును
వర్షం లేక చాలామంది రైతులు పంటలను వేసుకోలేక పోయారన్నారు. కాగా గత రెండు మూడు
రోజుల కిందట జిల్లాలో పంట వేసుకునేందుకు సరిపడా వర్షం పడడంతో, మెట్టసాగు రైతులు
పంట సాగు పనులు మొదలు పెట్టారని, కావున kadapa జిల్లాలో ప్రభుత్వం e-crop పంట నమోదు కార్యక్రమాన్ని, రానున్న అక్టోబర్ 10వ తేదీ వరకు గడువు
పెంచి నమోదు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమస్యతో పాటు, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి
పలు సమస్యల పైనా Rythu Seva Samithi ఈనెల 30వ తేదీ, సోమవారం రోజు కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర, నిరసన
కార్యక్రమం చేపట్టనున్నదని, వారు తెలిపారు. రైతులు రైతు శ్రేయోభిలాషులు, సోమవారం ఉదయం 10 గంటలకు kadapa కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని వారు కోరారు.
ఈ వార్త వీడియో వీక్షణకు ఈ లింక్ క్లిక్ చేయండి video
కామెంట్లు